గురుకులాలను వెంటనే పునఃప్రారంభించాలి: సీపీఎం

ABN , First Publish Date - 2021-10-20T05:04:56+05:30 IST

గురుకుల విద్యాలయాలను వెంటనే పునఃప్రారంభించాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు బొంతు రాంబాబు కోరారు.

గురుకులాలను వెంటనే పునఃప్రారంభించాలి: సీపీఎం

వైరా, అక్టోబరు 19: గురుకుల విద్యాలయాలను వెంటనే పునఃప్రారంభించాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు బొంతు రాంబాబు కోరారు. మంగళవారం చింతనిప్పు చలపతిరావు అధ్యక్షతన జరిగిన సీపీఎం సమావేశంలో రాంబాబు మాట్లాడారు. ప్రైవేట్‌, కార్పొరేట్‌ విద్యాసంస్థలు రెండునెలల నుంచి నడుస్తున్నాయని అలాగే ప్రభుత్వ పాఠశాలలు కూడా ప్రారంభించారని, గురుకులు ప్రారంభించకపోవడం శోచనీయమని విమర్శించారు. పునఃప్రారంభ సమాచారాన్ని హైకోర్టుకు సమర్పించి గురుకులాలను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సీపీఎం పట్టణ కార్యదర్శి సుంకర సుధాకర్‌, మచ్చా మణి, రవీందర్‌, శ్రీనివాసరావు, రామారావు, రజిత, బొంతు సమత, పాల్గొన్నారు.



Updated Date - 2021-10-20T05:04:56+05:30 IST