Bank fraud: అంబియన్స్ మాల్ యజమానిని అరెస్ట్ చేసిన ఈడి

ABN , First Publish Date - 2021-07-29T17:19:36+05:30 IST

బ్యాంకును మోసం చేసిన కేసులో నిందితుడైన గురుగ్రామ్ అంబియన్స్ మాల్ యజమాని రాజ్ ....

Bank fraud: అంబియన్స్ మాల్ యజమానిని అరెస్ట్ చేసిన ఈడి

గురుగ్రామ్ : బ్యాంకును మోసం చేసిన కేసులో నిందితుడైన గురుగ్రామ్ అంబియన్స్ మాల్ యజమాని రాజ్ సింగ్ గెహ్లాట్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు గురువారం అరెస్ట్ చేశారు.జమ్మూ కశ్మీర్ బ్యాంకు కన్సార్టియం కింద 800 కోట్లరూపాయల మేర అంబియన్స్ మాల్ యజమాని రాజ్ సింగ్ గెహ్లాట్ నిందితుడు. రాజ్ సింగ్ గెహ్లాట్ ఇంట్లో గత ఏడాది జరిపిన సోదాల్లో రూ.16 కోట్ల విదేశీ కరెన్సీని ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకును ఛీటింగ్ చేసి, 800 కోట్ల రూపాయల మేర మోసం చేసిన రాజ్ సింగ్ ను ఈడీ అధికారులు అరెస్టు చేసి ప్రశ్నిస్తున్నారు.

Updated Date - 2021-07-29T17:19:36+05:30 IST