అర్ధరాత్రి.. రోడ్డు పక్కన అపస్మారక స్థితిలో కనిపించిన యువతి.. ఆమె అసలు కథేంటో తెలిసి..

ABN , First Publish Date - 2021-11-09T16:20:29+05:30 IST

రాజస్థాన్‌లోని దౌసాలో గురుగ్రామ్(హరియాణా)కు చెందిన..

అర్ధరాత్రి.. రోడ్డు పక్కన అపస్మారక స్థితిలో కనిపించిన యువతి.. ఆమె అసలు కథేంటో తెలిసి..

రాజస్థాన్‌లోని దౌసాలో గురుగ్రామ్(హరియాణా)కు చెందిన ఒక యువతి సామూహిక అత్యాచారానికి గురైన సంఘటన చోటుచేసుకుంది. 23 ఏళ్ల ఆ యువతి తన స్నేహితురాలితోపాటు జైపూర్‌లోని చుంగీ ప్రాంతానికి వచ్చింది. అక్కడ రెండు రోజుల పాటు ఉంది. తరువాత ఆమె స్నేహితురాలు, ఆమె బాయ్ ఫ్రెండ్ తమతో పాటు ఆ యువతిని దౌసా తీసుకువచ్చారు. అక్కడ ఆమె స్నేహితురాలి బాయ్‌ఫ్రెండ్‌తో పాటు మరో ఇద్దరు యువకులు ఆమె చేత బీరు తాగించారు. 


తరువాత వారి మరో స్నేహితుడు అక్కడికి వచ్చాడు. ఆ నలుగురు యువకులు ఒకరి తరువాత ఒకరుగా ఆమెపై అత్యాచారం జరిపారు. ఆ తరువాత వారంతా పరారయ్యారు. అర్థరాత్రి పెట్రోలింగ్‌లో ఉన్న పోలీసులకు రోడ్డు పక్కన అపస్మారక స్థితిలో యువతి కనిపించింది. వెంటనే పోలీసులు.. బాధితురాలిని దౌసా జిల్లా ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు అత్యాచారం కేసు నమోదు చేశారు.  బాధితురాలకి వైద్య పరీక్షలు నిర్వహించి, నిందితుల కోసం గాలింపు చేపట్టారు. బాధితురాలి స్నేహితురాలిని ప్రశ్నిస్తున్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని దౌసా ఎస్పీ అనిల్ బెనీవాల్ తెలిపారు.

Updated Date - 2021-11-09T16:20:29+05:30 IST