భక్తిశ్రద్ధలతో గురుపౌర్ణమి వేడుకలు
ABN , First Publish Date - 2020-07-06T11:22:10+05:30 IST
హన్మకొండ చౌరస్తా రాగన్న దర్వాజ ప్రాంతంలోని సీతారామచంద్రస్వామి దేవాలయం (చిన్నకోవెల)లో ఆదివారం బ్రాహ్మణ సమితి
ఘనంగా గురుపౌర్ణమి
వరంగల్ కల్చరల్, జూలై 5: హన్మకొండ చౌరస్తా రాగన్న దర్వాజ ప్రాంతంలోని సీతారామచంద్రస్వామి దేవాలయం (చిన్నకోవెల)లో ఆదివారం బ్రాహ్మణ సమితి ఆధ్వర్యంలో గురు పౌర్ణమి, వ్యాస జయంతిని ఘనంగా నిర్వహించారు. సంస్కృత వేద పండితులు సముద్రాల శఠగోపాలాచార్యులు, గుదిమల్ల విజయకుమారాచార్యులు, గంగు మణికంఠశర్మ, అర్చకులు చెరుకుపల్లి నర్సింహాచార్యులు కలకోట రాఘవాచార్యులు, ప్రముఖ ఉపాధ్యాయులు తిరునగరి నరేందర్లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సేవా సమితి రాష్ట్ర శాఖ గౌరవాధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ, ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి జీవీఎస్ శ్రీనివాసాచారి, బ్రాహ్మణ సేవా సమితి మీడియా సెల్ కన్వీనర్ కాసర్ల వసంత్, వెంకటరమణాచార్యులు తదితరులు పాల్గొన్నారు.