భక్తిశ్రద్ధలతో గురు పౌర్ణమి వేడుకలు

ABN , First Publish Date - 2021-07-25T05:56:36+05:30 IST

మండలంలో గురుపౌర్ణమి వేడుకలను భక్తీ శ్రద్ధలతో నిర్వహించారు. మండలంలోని శబరిమాత ఆశ్రమంతో పాటు వివిధ ఆశ్రమంలో వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కౌఠ(బి)లో జరిగిన కార్యక్రమంలో భక్తులు పాల్గొని తమ గురువైన శభరిమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోథ్‌లోని

భక్తిశ్రద్ధలతో గురు పౌర్ణమి వేడుకలు
కౌట(బి) శబరిమాత ఆలయంలో పూజలు చేస్తున్న భక్తులు

బోథ్‌, జూలై 24: మండలంలో గురుపౌర్ణమి వేడుకలను భక్తీ శ్రద్ధలతో నిర్వహించారు. మండలంలోని శబరిమాత ఆశ్రమంతో పాటు వివిధ ఆశ్రమంలో వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కౌఠ(బి)లో జరిగిన కార్యక్రమంలో భక్తులు పాల్గొని తమ గురువైన శభరిమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోథ్‌లోని సాయిబాబా ఆలయంలో పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అలాగే, మండల కేంద్రంలో గురు పౌర్ణమిని పురస్కరించుకుని 1993-1994 10వ తరగతి బ్యాచ్‌ విద్యార్థులకు తమకు విద్యా బుద్ధులు చెప్పిన ఉపాధ్యాయులను సన్మానించి పాదపూజ చేశారు.
భీంపూర్‌: మండలంలోని పిప్పల్‌కోటి గ్రామంలో గురుపౌర్ణమి సందర్భంగా శనివారం వేంకటేశ్వర ఆలయంలో విశేష పూజలు చేశారు. సాయిభక్తులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.  
తాంసి: గురుపౌర్ణమి పండుగను శనివారం మండలంలోని ఆయా గ్రామాలలో ఘనంగా జరుపుకున్నారు. ఉదయం నుంచి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. మండలంలోని పొన్నారి, హస్నాపూర్‌, జామిడి,వడ్డాడి, తాంసి, గిరిగావ్‌ గ్రామాలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.

Updated Date - 2021-07-25T05:56:36+05:30 IST