గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-07-06T03:07:52+05:30 IST

మండలంలోని మైపాడు పంచాయతీ తూర్పు పడమటపాలెం వద్ద గుర్తు తెలియని వ్యక్తి చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకు

గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య
గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం

ఇందుకూరుపేట, జూలై 5 : మండలంలోని మైపాడు  పంచాయతీ తూర్పు పడమటపాలెం వద్ద గుర్తు తెలియని వ్యక్తి చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్‌ఐ ఆనంద్‌ తెలిపారు. మంగళవారం ఉదయం అందిన సమాచారం మేరకు  మృతదేహాన్ని గుర్తించామన్నారు. మృతదేహం వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదని,  మృతుడు సన్నగా 40 నుంచి 45ఏళ్ల మధ్య వయసు  కలిగి ఉన్నాడని తెలిపారు. ఎవరికైనా ఆచూకీ తెలిస్తే  తెలియజేయాలన్నారు.  మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపి కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Updated Date - 2022-07-06T03:07:52+05:30 IST