ఘనంగా గురజాడ అప్పారావు జయంతి వేడుకలు..

ABN , First Publish Date - 2020-09-21T17:34:31+05:30 IST

విజయనగరం: జిల్లా కేంద్రంలో మహా కవి గురజాడ అప్పారావు 158 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఘనంగా గురజాడ అప్పారావు జయంతి వేడుకలు..

విజయనగరం: జిల్లా కేంద్రంలో మహా కవి గురజాడ అప్పారావు 158 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉత్సవంగా గురజాడ జయంతి వేడుకల నిర్వహించారు. గురజాడకు రాష్ట్ర సాంస్కృతిక, సృజనాత్మక సమితి చైర్ పర్సన్ వంగపండు ఉష, శాసన మండలి సభ్యులు పెనుమత్స సురేష్ బాబు, శాసన సభ్యులు బొత్స అప్పల నరసయ్య, శంబంగి చిన అప్పల నాయుడు, మాజీ ఎం.పి. బొత్స ఝాన్సీ, జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్, గురజాడ కుటుంబ సభ్యులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు ఘన నివాళులు అర్పించారు.

 

Updated Date - 2020-09-21T17:34:31+05:30 IST