గుంటూరులో దారుణం
ABN , First Publish Date - 2022-04-04T18:42:09+05:30 IST
జిల్లాలోని శంకర్ విలాస్ సెంటర్లో దారణం జరిగింది.
గుంటూరు: జిల్లాలోని శంకర్ విలాస్ సెంటర్లో దారణం జరిగింది. నగరం నడిబొడ్డున ఓ వ్యక్తి దోపిడికి యత్నించాడు. పట్టపగలే కళ్ళలో కారం కొట్టి డబ్బు దోచుకునేందుకు విశ్వప్రయత్నం చేశారు. ఐసిఐసిఐ నుండి డబ్బు డ్రా చేసుకుని వస్తున్న వ్యక్తి కళ్ళలో కారం కొట్టి నగదు దోచుకునేందుకు ప్రయత్నించగా... దొంగను స్థానికులు పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దొంగను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.