ఆర్టీసీ బస్సు ఢీకొని రైతు మృతి
ABN , First Publish Date - 2021-10-22T17:08:22+05:30 IST
జిల్లాలోని భట్టిప్రోలు మండలం మైలవరం గ్రామంలో ఆర్టీసీ బస్సు ఢీకొని రైతు మృతి చెందాడు.
గుంటూరు: జిల్లాలోని భట్టిప్రోలు మండలం మైలవరం గ్రామంలో ఆర్టీసీ బస్సు ఢీకొని రైతు మృతి చెందాడు. పొలం పనులు ముగించుకుని ద్విచక్రవాహనంపై ఇంటికి తిరిగి వెళ్తున్న మరకా ఆంజనేయులు (35)ను బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. బస్సు చీరాల నుండి రేపల్లె వెళ్తుండగా ప్రమాదం జరిగింది. అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.