గుంటూరు జిల్లా... దాచేపల్లిలో వైసీపీ అరాచకం
ABN , First Publish Date - 2021-11-17T20:50:29+05:30 IST
జిల్లాలోని దాచేపల్లిలో వైసీపీ అరాచకానికి పాల్పడింది. ఓటమిని జీర్ణించుకోలేక వైసీపీ నేతలు దాడులకు తెగబడ్డారు. 14 వార్డు నుంచి వైసీపీ రెబల్ అభ్యర్థి షేక్ షరీఫ్ గెలిచారు.
గుంటూరు: జిల్లాలోని దాచేపల్లిలో వైసీపీ అరాచకానికి పాల్పడింది. ఓటమిని జీర్ణించుకోలేక వైసీపీ నేతలు దాడులకు తెగబడ్డారు. 14 వార్డు నుంచి వైసీపీ రెబల్ అభ్యర్థి షేక్ షరీఫ్ గెలిచారు. అలాగే వైసీపీ రెబల్ అభ్యర్థి చేతిలో వైసీపీ అభ్యర్థి జాకీర్ హుస్సేన్ ఓడిపోయాడు. దాచేపల్లిలోని జాకీర్ హుస్సేన్ మండల పార్టీ కన్వీనర్గా ఉన్నారు. మసీదులో ఉన్న షరీఫ్ కుటుంబ సభ్యులపై జాకీర్ హుస్సేన్ వర్గం దాడికి పాల్పడింది. దాంతో మసీదులో ముస్లింలు భయభ్రాంతులకు గురయ్యారు.