ఏప్రిల్ 1 నుంచి గుంటూరు-కాచిగూడ ఎక్స్ప్రెస్
ABN , First Publish Date - 2021-02-25T07:04:12+05:30 IST
కరోనా ప్రభావంతో నిలిచిన పలు రైళ్లు తిరిగి పట్టాలు ఎక్కనున్నాయి. గుంటూరు - కాచిగూడ ఎక్స్ప్రెస్ రైలు ఏప్రిల్ 1 నుంచి తిరిగి ప్రారంభం కానుంది.
గిద్దలూరు టౌన్, ఫిబ్రవరి 24 : కరోనా ప్రభావంతో నిలిచిన పలు రైళ్లు తిరిగి పట్టాలు ఎక్కనున్నాయి. గుంటూరు - కాచిగూడ ఎక్స్ప్రెస్ రైలు ఏప్రిల్ 1 నుంచి తిరిగి ప్రారంభం కానుంది. లాక్డౌన్తో రద్దు అయిన ఆ రైలును పునరుద్ధరించనున్నట్లు తెలిసింది. ఏప్రిల్ 1వ తేదీ రాత్రి 7గంటలకు గుంటూరులో బయలుదేరే మరుసటి రోజు ఉదయం 9.45కు కాచిగూడ చేరుకుంటుంది. ఏప్రిల్ 2న కాచిగూడలో మధ్యాహ్నం 3.10కు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 6.45గంటలకు గుంటూరుకు చేరుతుంది.