గుంటూరు: టీడీపీ నేతలను కలిసిన చిరుమామిళ్ల దళితులు

ABN , First Publish Date - 2020-08-03T19:07:38+05:30 IST

గుంటూరు: టీడీపీ నేతలను కలిసిన చిరుమామిళ్ల దళితులు

గుంటూరు: టీడీపీ నేతలను కలిసిన చిరుమామిళ్ల దళితులు

గుంటూరు: జిల్లా టీడీపీ నేతలను చిరుమామిళ్ల దళితులు సోమవారం కలిశారు. నిన్న చిరుమామిళ్ళలో టీడీపీ ఎంపీటీసి అభ్యర్థి కుటుంబంపై మారణాయుదాలతో దాడి జరిగింది. ఈ దాడిలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఎన్నికలలో పోటీ చేసినందుకే తమపై దాడికి పాల్పడుతున్నారని బాధితులు వాపోయారు. పోలీసులు దాడిని అష్టచమ్మా ఆట వివాదం అని చెప్పడం బాధిస్తోందన్నారు. తమపై దాడి ఇది మూడో సారి అని... ఎన్ని సార్లు చెప్పిన పోలీసులు పట్టించుకోలేదని తెలిపారు. తమకు ప్రాణ రక్షణ లేదని బాధితులు ఆవేదన చెందారు. బాధితులకు పూర్తి అండగా ఉంటామని జిల్లా నేతలు హామీ ఇచ్చారు. 

Updated Date - 2020-08-03T19:07:38+05:30 IST