తప్పకుండా కొండపల్లి వెళ్తాం: Nakka anandababu

ABN , First Publish Date - 2021-07-31T16:28:09+05:30 IST

కొండపల్లిలో భారీగా అక్రమ మైనింగ్ జరుగుతోందని.. అందుకే టీడీపీ నేతల బృందాన్ని అడ్డుకున్నారని మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు ఆరోపించారు.

తప్పకుండా కొండపల్లి వెళ్తాం: Nakka anandababu

గుంటూరు: కొండపల్లిలో భారీగా అక్రమ మైనింగ్ జరుగుతోందని.. అందుకే టీడీపీ నేతల బృందాన్ని అడ్డుకున్నారని మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వానికి దమ్ముంటే అక్రమ మైనింగ్ జరగడం లేదని నిరూపించాలని సవాల్ విసిరారు. పోలీసుల ద్వారా  ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని జగన్ దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. అగ్రవర్ణాలు చట్టాన్ని అసహ్యించుకునే విధంగా చేస్తున్నారని అన్నారు. తప్పుడు అట్రాసిటీ కేసులు నమోదుతో చట్టాన్ని ఎత్తివేయించే ప్రయత్నం జగన్ చేస్తున్నారన్నారు. అట్రాసిటీ చట్టం దుర్వినియోగం పై ఒక దళితుడుగా ఎంతో ఆవేదన చెందుతున్నట్లు తెలిపారు. పోలీసులతో ఎన్ని రోజులు ఆపగలుగుతారో చూస్తామన్నారు. తప్పకుండా కొండపల్లి వెళ్తామని... అక్రమ మైనింగ్ బయటపెడతామని నక్కా ఆనందబాబు స్పష్టం చేశారు. 

Updated Date - 2021-07-31T16:28:09+05:30 IST