Guntur ఆర్టీసీ బస్టాండ్లోకి దూసుకొచ్చిన టీడీపీ ఇన్చార్జ్
ABN , First Publish Date - 2021-10-20T13:47:11+05:30 IST
జిల్లా వ్యాప్తంగా టీడీపీ బంద్ కొనసాగుతోంది. ఈ క్రమంలో జిల్లా ఆర్టీసీ బస్టాండ్లోకి టీడీపీ ఇన్చార్జ్ నసీర్ దూసుకువచ్చారు.
గుంటూరు: జిల్లా వ్యాప్తంగా టీడీపీ బంద్ కొనసాగుతోంది. ఈ క్రమంలో జిల్లా ఆర్టీసీ బస్టాండ్లోకి టీడీపీ ఇన్చార్జ్ నసీర్ దూసుకువచ్చారు. వందలాది పోలీసులను దాటి నసీర్ బృందం ర్యాలీగా వచ్చింది. బస్టాండ్ ఆవరణలో సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. బస్సులను నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.