Guntur: టీడీపీ బ్రాహ్మణ నేతల మధ్య ముసలం
ABN , First Publish Date - 2021-10-12T18:35:47+05:30 IST
జిల్లాలోని టీడీపీ బ్రాహ్మణ నేతల మధ్య ముసలం నెలకొంది. ఈ నెల 16న టీడీపీ ఆఫీస్లో ఆనంద సూర్య ఆమరణ నిరహార దీక్షకు ప్రకటన చేశారు.
గుంటూరు: జిల్లాలోని టీడీపీ బ్రాహ్మణ నేతల మధ్య ముసలం నెలకొంది. ఈ నెల 16న టీడీపీ ఆఫీస్లో ఆనంద సూర్య ఆమరణ నిరహార దీక్షకు ప్రకటన చేశారు. తెలంగాణకు చెందిన ఆనంద సూర్యను ఏపీ టీడీపీ బ్రాహ్మణ నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఆనంద్ సూర్యకు వ్యతిరేకంగా టీడీపీ ఆఫీస్ ఎదుట బ్రాహ్మణ చైతన్య వేదిక ఆధ్వర్యంలో నిరసన దీక్షకు ప్రకటన చేశారు. టీడీపీ ప్రభుత్వంలో బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్గా ఆనంద సూర్య పని చేశారు. ఈ నెల 16న ఇరు వర్గాలు దీక్షలకు ప్రకటన వెలువడింది.