ఉరివేసుకుని మహిళ వలంటీర్ ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-11-17T11:59:54+05:30 IST
మంగళగిరిలోని కుప్పురావుకాలనీకి చెందిన వెనిగళ్ల రామలక్ష్మి(31)అనే ఓ వివాహిత మంగళవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె రామలక్ష్మి నగరంలోని 11వ నెంబరు
గుంటూరు: మంగళగిరిలోని కుప్పురావుకాలనీకి చెందిన వెనిగళ్ల రామలక్ష్మి(31)అనే ఓ వివాహిత మంగళవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె రామలక్ష్మి నగరంలోని 11వ నెంబరు సచివాలయంలో వలంటీర్గా పనిచేస్తుంది. మంగళవారం యథావిధిగా సచివాలయంలో విధులు నిర్వహించుకుని ఇంటికి వచ్చిన రామలక్ష్మి రాత్రి ఏడుగంటల సమయంలో ఉరిపోవేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు చెబుతున్నారు. కుటుంబ కలహాల నేపఽథ్యంలోనే రామలక్ష్మి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు తెలుస్తుంది. ఆమెకు భర్త, ముగ్గురు సంతానం ఉన్నారు.