లొంగిపోయిన గుంటూరు శ్రీను

ABN , First Publish Date - 2021-04-11T09:11:48+05:30 IST

తెలుగు రాష్ర్టాల్లో కలకలం రేపిన ప్రవీణ్‌రావు-సోదరుల అపహరణ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన గుంటూరు శ్రీను శనివారం బోయినపల్లి పోలీసుల ఎదుట

లొంగిపోయిన గుంటూరు శ్రీను

బోయినపల్లి పోలీస్‌స్టేషన్‌లో హాజరు



బోయినపల్లి, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ర్టాల్లో కలకలం రేపిన ప్రవీణ్‌రావు-సోదరుల అపహరణ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన గుంటూరు శ్రీను శనివారం బోయినపల్లి పోలీసుల ఎదుట హాజరయ్యాడు. అపహరణలో కీలక పాత్ర పోషించిన శ్రీను, నాటి నుంచి పరారీలో ఉన్నాడు. సికింద్రాబాద్‌ 6వ మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ కోర్టు ఈ కేసులో అతడికి ఇటీవల షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. 11వ అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ర్టేటు వద్ద ఇద్దరు వ్యక్తుల పూచీకత్తును నిందితుడు సమర్పించాలని, పోలీసులు విచారణ నిమిత్తం ఎప్పుడు పిలిచినా వెళ్ళాలని షరతులను విధించింది. ఈ నేపథ్యంలో నిందితుడు శ్రీను తాజాగా ఇద్దరు వ్యక్తుల పూచీకత్తుతో వెళ్ళి న్యాయస్థానంలో లొంగిపోయాడు. 

Updated Date - 2021-04-11T09:11:48+05:30 IST