ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం ఘటనపై స్పందించిన ఎస్పీ విశాల్

ABN , First Publish Date - 2022-01-03T03:16:37+05:30 IST

దుర్గి ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం ఘటనపై రూరల్ ఎస్పీ విశాల్ గున్ని స్పందించారు. నిందితుడు కోటేశ్వరరావును వెంటనే అరెస్ట్ చేయాలని..

ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం ఘటనపై స్పందించిన ఎస్పీ విశాల్

గుంటూరు: దుర్గి ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం ఘటనపై రూరల్ ఎస్పీ విశాల్ గున్ని స్పందించారు. నిందితుడు కోటేశ్వరరావును వెంటనే అరెస్ట్ చేయాలని దుర్గి పోలీసులను ఆదేశించారు. ఘటన‌పై సమగ్ర దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని గురజాల డీఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన కోటేశ్వరరావుపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఎస్పీ వెల్లడించారు. 


Updated Date - 2022-01-03T03:16:37+05:30 IST