Guntur: రైల్వేస్టేషన్, ఆర్మీ రిక్రూట్‌మెంట్ బోర్డు వద్ద పోలీసుల మోహరింపు

ABN , First Publish Date - 2022-06-18T13:28:14+05:30 IST

జిల్లాలోని గుంటూరు రైల్వేస్టేషన్, ఆర్మీ రిక్రూట్మెంట్ బోర్డు వద్ద భారీగా పోలీసులు మోహరించారు.

Guntur: రైల్వేస్టేషన్, ఆర్మీ రిక్రూట్‌మెంట్ బోర్డు వద్ద పోలీసుల మోహరింపు

గుంటూరు: జిల్లాలోని గుంటూరు రైల్వేస్టేషన్, ఆర్మీ రిక్రూట్మెంట్ బోర్డు వద్ద భారీగా పోలీసులు మోహరించారు. దాడులు జరగవచ్చన్న ముందస్తు సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆర్మీ నియామక అధికారి కార్యాలయం వద్దకు వెళ్ళే దారిని మూసివేశారు. గుంటూరు రైల్వేస్టేషన్ వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. వాట్సప్ గ్రూపులు ఏర్పాటు చేసుకుని ఛలో గుంటూరు కార్యక్రమంలో పాల్గొంటారని నిఘా వర్గాలకు సమాచారం వచ్చింది. ఈ క్రమంలో రైల్వే స్టేషన్‌కు వచ్చిన అనుమానితులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. కొత్తపేట పోలీస్ స్టేషన్ సమీపంలో రైల్వే స్టేషన్ వద్దకు వస్తున్న ఆర్మీ అభ్యర్థులను అరెస్ట్ చేశారు. ఆందోళన చేసేందుకు స్టేషన్ వస్తున్నట్లు సమాచారం ఉండటంతో పోలీసులు ఎక్కడికక్కడ ఆర్మీ అభ్యర్థులను అరెస్టు చేస్తున్నారు. 

Updated Date - 2022-06-18T13:28:14+05:30 IST