గుంటూరు అర్బన్ పోలీసుల తీరు విచిత్రం

ABN , First Publish Date - 2021-05-13T16:08:56+05:30 IST

టీడీపీ నేతల పట్ల గుంటూరు అర్బన్ పోలీసులు విచిత్రంగా ప్రవర్తించారు. మంత్రి సిధిరి అప్పలరాజుపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన టీడీపీ నేతలపైనే పోలీసులు కేసు నమోదు చేశారు.

గుంటూరు అర్బన్ పోలీసుల తీరు విచిత్రం

గుంటూరు: టీడీపీ నేతల పట్ల గుంటూరు అర్బన్ పోలీసులు విచిత్రంగా ప్రవర్తించారు. మంత్రి సిధిరి అప్పలరాజుపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన టీడీపీ నేతలపైనే  పోలీసులు కేసు నమోదు చేశారు. టీడీపీ నేతలు తెనాలి శ్రావణ్ కుమార్, కోవెలమూడి రవీంద్ర, కనపర్తి, చిట్టిబాబు, మానుకొండ శివ ప్రసాద్, ధారూ నాయక్ , గోళ్ల ప్రభాకర్ , కొమ్మినేని కోటేశ్వరరావులపై కేసులు నమోదు అయ్యాయి. 188, 269 సెక్షన్ల కింద  అరండల్ పేట పోలీసులు కేసులు నమోదు చేశారు. దీంతో పోలీసులు తీరుపై టీడీపీ నేతల ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబుపై ఫిర్యాదు ఇచ్చిన వెంటనే కేసు నమోదు చేసిన పోలీసులు... మంత్రిపై మాత్రం కేసు నమోదు చేయకపోవడంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు.

Updated Date - 2021-05-13T16:08:56+05:30 IST