పిడుగురాళ్ల పోలీసులకు కోర్టు ధిక్కారణ నోటీసులు

ABN , First Publish Date - 2021-10-23T19:29:57+05:30 IST

పిడుగురాళ్ల పోలీసులకు కోర్టు ధిక్కారణ నోటీసులు జారీ అయ్యాయి. తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి దియ్యా రామకృష్ణ కేసులో ఈ మేరకు జారీ అయ్యాయి.

పిడుగురాళ్ల పోలీసులకు కోర్టు ధిక్కారణ నోటీసులు

గుంటూరు: పిడుగురాళ్ల పోలీసులకు కోర్టు ధిక్కారణ నోటీసులు జారీ అయ్యాయి. తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి దియ్యా రామకృష్ణ కేసులో ఈ మేరకు జారీ అయ్యాయి. తనను అక్రమంగా అరెస్టు చేశారంటు హైకోర్టులో రామకృష్ణ  పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు స్టే ఉన్నా రామకృష్ణను  పిడుగురాళ్ల  పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. పోలీసులు తీరుపై కోర్టులో న్యాయవాదులు నర్రా శ్రీనివాస్, ముప్పాళ్ళ బాలకృష్ణలు కోర్టు ధిక్కారణ, పరువు నష్టం పిటిషన్ దాఖలు చేశారు. దీంతో పిడుగురాళ్ల పోలీసులపై ధర్మాసనం  తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషనర్ వాదనలు విన్న తర్వాత వాస్తవమని  తేలితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హైకోర్టు హెచ్చరించింది.

Updated Date - 2021-10-23T19:29:57+05:30 IST