ప్రాణహాని ఉందని సీఎం జగన్‌కు విన్నవించి..

ABN , First Publish Date - 2020-10-31T03:26:02+05:30 IST

శ్రీనివాసరావు సెల్ఫీ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

ప్రాణహాని ఉందని సీఎం జగన్‌కు విన్నవించి..

గుంటూరు : తుళ్లూరు మండలం లింగాయపాలెంలో దళితుడు శ్రీనివాసరావు సెల్ఫీ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. తనకు ప్రాణహాని ఉందని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి శ్రీనివాసరావు విన్నవించుకున్నాడు. ఎంపీ నందిగం సురేష్ అనుచరుల నుంచి తనను కాపాడాలని వేడుకున్నాడు. జూన్‌లో తనపై దాడి చేశారని శ్రీనివాసరావు వీడియోలో వివరించాడు. జూన్ 27న దాడి జరిగినట్లు తుళ్లూరు పోలీసులకు శ్రీనివాసరావు ఫిర్యాదు చేశాడు.


అయితే.. ఫిర్యాదు స్వీకరించి నిందితులపై చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు.. కేసు నమోదుచేసుకుని అక్కడితో ఆగిపోయారని ఆయన వాపోయాడు. పోలీసులు చర్యలు తీసుకోకుండా జాప్యం చేస్తున్నారని శ్రీనివాసరావు తీవ్ర ఆవేదనకు లోనవుతూ వీడియోలో చెప్పాడు. పోలీసుల తీరుపై సెల్ఫీ వీడియోలో శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే ఇంత జరిగిన తర్వాత అయినా పోలీసులు స్పందించి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటారో లేదో వేచి చూడాలి.

Updated Date - 2020-10-31T03:26:02+05:30 IST