వెలుగులో వచ్చిన మరో బిల్డర్ మోసం
ABN , First Publish Date - 2020-08-15T21:40:19+05:30 IST
వెలుగులో వచ్చిన మరో బిల్డర్ మోసం
గుంటూరు: జిల్లాలో మరో బిల్డర్ మోసం వెలుగులోకి వచ్చింది. నందివెలుగు రోడ్డులో తిరుమల గార్డెన్స్ పేరుతో 370 ఫ్లాట్లతో అపార్ట్మెంట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అనంతరం 2016లో ఫ్లాట్లు అమ్మకానికి పెట్టి, 80 శాతం నగదు వసూలు చేశారు. కాగా నాలుగేళ్లు గడిచిన నిర్మాణాలు పూర్తి కాలేదు. బిల్డర్ మంచికల పూడి శ్రీనివాస్ను బాధితులు ఎన్నిసార్లు అడిగినా స్పందించలేదు. మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసిన ఫలితం లేకుండా పోయింది. బిల్డర్ తీరుపై నిరసన చేపట్టిన ఖాతాదారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.