గుంటూరులో దారుణం..

ABN , First Publish Date - 2022-05-03T14:15:44+05:30 IST

తెనాలిలో దారుణం చోటు చేసుకుంది. తన తల్లితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఆ వ్యక్తి మర్మాంగాన్ని కోసింది కూతురు. రాత్రి మద్యం తాగి వచ్చి డాబాపై

గుంటూరులో దారుణం..

గుంటూరు: తెనాలిలో దారుణం చోటు చేసుకుంది. తన తల్లితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఆ వ్యక్తి మర్మాంగాన్ని కోసింది కూతురు. రాత్రి మద్యం తాగి వచ్చి డాబాపై నిద్రిస్తున్న సమయంలో రామచంద్రారెడ్డిపై కూతురు విచక్షణరహితంగా దాడి చేసింది. తల్లితో పడుకుని ఉన్న సమయంలో బ్లేడ్‎తో మర్మాంగాన్ని కోసివేసింది. బాధితుడు పెద్దగా కేకలు వేయడంతో స్పందించిన స్థానికులు రామచంద్రారెడ్డిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. బాధితుడి స్వస్థలం చెరుకుపల్లి మండలం తుమ్మలపాలెం వాసిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read more