ఆంధ్రా సిమెంట్ ఫ్యాక్టరీని తెరిపించండి: ఎమ్మెల్సీ జంగా
ABN , First Publish Date - 2021-02-27T18:40:07+05:30 IST
ఆంధ్రా సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికులతో కలిసి ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి శనివారం జిల్లా కలెక్టర్ను కలిశారు. ఈ సందర్భంగా కార్మికుల సమస్యలపై కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు.
గుంటూరు: ఆంధ్రా సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికులతో కలిసి ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి శనివారం జిల్లా కలెక్టర్ను కలిశారు. ఈ సందర్భంగా కార్మికుల సమస్యలపై కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఎమ్మెల్సీ జంగా మీడియాతో మాట్లాడుతూ దాచేపల్లి మండలం గామాలపాడు ఆంధ్ర సిమెంట్ ఫ్యాక్టరీని 2011లో జేపీ గ్రూప్ తీసుకుందని... కానీ పూర్తి స్థాయిలో ఫ్యాక్టరీ నడపడం లేదని తెలిపారు. ఆరు నెలలుగా కార్మికులకు జీతాలు లేవన్నారు. ఆరు గ్రామాలకు చెందిన వేయి మంది కుటుంబాలు రోడ్డున్న పడ్డాయని చెప్పారు. దీనిపై పలు మార్లు యాజమాన్యం దృష్టికి తీసుకువచ్చిన ఫలితం లేదని చెప్పారు. కలెక్టర్ను కలిసి ఆంధ్రా సిమెంట్ ఫ్యాక్టరీని తెరిపించాలని కోరామన్నారు. లాకౌట్ గానీ, లేఅవుట్ గాని ప్రకటించలేదని తెలిపారు. కార్మికులకు అండగా ఉండేందుకు సీఎం దృష్టికి కూడా తీసుకెళ్తామని ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి తెలియజేశారు.