గుంటూరు: వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు
ABN , First Publish Date - 2022-03-17T02:41:19+05:30 IST
జిల్లాలో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. వినుకొండ పట్టణంలో
గుంటూరు: జిల్లాలో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. వినుకొండ పట్టణంలో వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు మొదలయ్యాయి. అంకాళమ్మ పేటకు చెందిన 40 వైసీపీ కుటుంబాలు టీడీపీలో చేరాయి. వైసీపీ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ రోషన్ జమిర్ కూడా టీడీపీలో చేరారు. వీరికి మాజీ ఎమ్మెల్యే జి.వి ఆంజనేయులు పార్టీ కండువాలు కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు.