గుంటూరులో చిట్టీల పేరుతో మోసం

ABN , First Publish Date - 2021-06-15T00:38:18+05:30 IST

గుంటూరులో చిట్టీల పేరుతో మోసం

గుంటూరులో చిట్టీల పేరుతో మోసం

గుంటూరు: చిట్టీల పేరుతో మోసం చేసి పారిపోయేందుకు ప్రయత్నించిన వ్యక్తిని బాధితులు అడ్డుకున్నారు. గుంటూరు ద్వారకా నగర్ కాలనీకి చెందిన సాంబశివరావు గత కొంతకాలంగా చిట్టీల వ్యాపారం చేస్తున్నారు. స్థానికుల దగ్గర నుంచి పెద్ద మొత్తంలో అప్పుడు తీసుకున్నారు. తిరిగి వాటిని చెల్లించకుండా పారిపోయేందుకు ప్రయత్నిస్తుండటంతో బాధితులు అడ్డుకున్నారు. గతంలోనే బాధితులంతా అర్బన్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఇప్పటికైనా సాంబశివరావును అరెస్ట్ చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. కోట్లలో డబ్బులు వసూలు చేసినట్లు బాధితులు తెలిపారు. కొంతమంది చిట్టీలు వేసిన వారికి డబ్బులు ఇవ్వలేదని అన్నారు. 

Updated Date - 2021-06-15T00:38:18+05:30 IST