కోటప్పకొండ ఆలయంలో వెండి ఏకాహారతి మాయం...చెత్తలో ప్రత్యక్షం

ABN , First Publish Date - 2022-04-29T13:43:14+05:30 IST

జిల్లాలోని కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి ఆలయంలో వెండి ఏకాహారతి మాయమైంది.

కోటప్పకొండ ఆలయంలో వెండి ఏకాహారతి మాయం...చెత్తలో ప్రత్యక్షం

గుంటూరు: జిల్లాలోని కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి ఆలయంలో వెండి ఏకాహారతి మాయమైంది. రెండు నెలల క్రితం స్వామి వారికి ఓ భక్తుడు ఈ ఏకాహారతిని స్వామివారికి బహూకరించాడు. రూ.40వేలతో ఈ కానుకను ప్రత్యేకంగా తయారు చేయించాడు. నాలుగు రోజుల క్రితం కనిపించకుండా పోయిన ఏకాహారతిపై అధికారులను భక్తుడు ప్రశ్నించాడు. దీంతో అప్రమత్తమైన అధికారులు ఏకాహారతి కోసం గర్భగుడిని శుభ్రం చేసి బయట పడేసిన చెత్తలో గాలించారు. చెత్తలో ఏకాహారతి బయటపడింది. సిబ్బంది తీరుపై భక్తులు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2022-04-29T13:43:14+05:30 IST