వైద్యులు పట్టించుకోవడంలేదని వేదనతో.. ఆస్పత్రి పైనుంచి..
ABN , First Publish Date - 2020-09-24T14:56:05+05:30 IST
అనారోగ్యంతో ఉన్న తనను వైద్యులు పట్టించుకోలేదనే వేదనతో గుంటూరు బొంగరాల బీడుకు..
గుంటూరు: అనారోగ్యంతో ఉన్న తనను వైద్యులు పట్టించుకోలేదనే వేదనతో గుంటూరు బొంగరాల బీడుకు చెందిన శివప్రసాద్(35) ఆత్మహత్యకు యత్నించాడు. ఇతడు కొంతకాలంగా లివర్ సమస్యతో బాధ పడుతున్నాడు. ఈ నెలలోనే మూడు సార్లు జీజీహెచ్ ఓపీకి వస్తే వైద్యులు మందులు ఇచ్చి పంపారు. సమస్య తీవ్రంగా ఉందని చెప్పినా కుటుంబసభ్యులు పట్టించుకోలేదు. దీంతో బుధవారం జీజీహెచ్ చికిత్స కోసం రాగా వారు మూడో అంతస్తులోని న్యూరాలజీ విభాగానికి పంపారు. ఎంత సేపటికి వైద్యులు రాకపోవడం, అనారోగ్య సమస్య తీవ్రం కావడంతో, అక్కడ నుంచే కిందకు దూకాడు. మొదటి అంతస్తులోని రేకులపై పడడంతో గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.