కరోనాలో మూడో స్థానంలోకి రాష్ట్రం: మాజీ మంత్రి ఆనందబాబు

ABN , First Publish Date - 2020-08-09T12:35:39+05:30 IST

కరోనా కేసుల్లో ఏపీని దేశంలోనే మూడో స్థానంలో సీఎం జగన్‌ నిలబెట్టారని..

కరోనాలో మూడో స్థానంలోకి రాష్ట్రం: మాజీ మంత్రి ఆనందబాబు

గుంటూరు(ఆంధ్రజ్యోతి): కరోనా కేసుల్లో ఏపీని దేశంలోనే మూడో స్థానంలో సీఎం జగన్‌ నిలబెట్టారని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు విమర్శించారు. శనివారం ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అత్యంత ప్రజాధరణ పొందిన సీఎంలలో జగన్‌ మూడో స్థానంలో ఉన్నారని చెప్పడం హాస్యాస్పదమన్నారు. కరోనాతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడంలో ప్రథమ స్థానంలో ఉన్నారంటూ ధ్వజమెత్తారు. ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన సత్వర చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. సాక్షాత్తు మంత్రులు, వైసీపీ పెద్దలే మెరుగైన వైద్యం కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారని గుర్తుచేశారు. సీనియర్‌ నేత మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ శానిటైజర్‌ పేరుతో వైసీపీ నేతలు కల్తీ మద్యంకు తెర తీశారన్నారు. శానిటైజర్‌ తాగి మృతి చెందిన కుటుంబాలకు రూ.50 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. 


Updated Date - 2020-08-09T12:35:39+05:30 IST