గుంటూరు జిల్లాలో వైసీపీ నేతల ధర్నా

ABN , First Publish Date - 2022-01-24T20:03:32+05:30 IST

సత్తెనపల్లి మండలం, పెదమక్కెన జెడ్పీ హైస్కూల్ ఎదుట వైసీపీ నేతలు ధర్నా చేపట్టారు.

గుంటూరు జిల్లాలో వైసీపీ నేతల ధర్నా

గుంటూరు జిల్లా: సత్తెనపల్లి మండలం, పెదమక్కెన జెడ్పీ హైస్కూల్ ఎదుట వైసీపీ నేతలు ధర్నా చేపట్టారు. ఉపాధ్యాయులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పీఆర్సీ కోసం ఉపాధ్యాయులు చేస్తున్న పోరాటానికి వ్యతిరేకంగా వైసీపీ నేతలు ధర్నా చేపట్టారు. సమయానికి బడికి రాని టీచర్లు మాకోద్దని నినాదాలు చేశారు. 100 శాతం ఫలితాలు తీసుకురాలేని టీచర్లు మాకోద్దన్నారు. కాగా ఉపాధ్యాయులు సీఎం జగన్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేయడంపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు.

Updated Date - 2022-01-24T20:03:32+05:30 IST