జగన్ తీరుపై సొంతపార్టీ నేతల్లోనే తీవ్ర అసహనం

ABN , First Publish Date - 2021-12-10T17:12:57+05:30 IST

గుంటూరు: సీఎం జగన్ తీరుపై సొంతపార్టీ నేతల్లోనే తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది.

జగన్ తీరుపై సొంతపార్టీ నేతల్లోనే తీవ్ర అసహనం

గుంటూరు: సీఎం జగన్ తీరుపై సొంతపార్టీ నేతల్లోనే తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. రోశయ్య సంస్మరణ సభలో గుంటూరు జిల్లా, చిలకలూరిపేట వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ బావమరిది వెంకటసుబ్బయ్య చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి.


గుంటూరులో సోమేపల్లి సాంబయ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో రోశయ్య సంస్మరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైసీపీ నేత మర్రి రాజశేఖర్‌తో పాటు ఆయన బావమరిది వెంకటసుబ్బయ్య హాజరయ్యారు. సీఎం జగన్, సాక్షి మీడియా తీరును వెంకటసుబ్బయ్య విమర్శించారు. రోశయ్య పార్ధివదేహాన్ని చూసేందుకు ముఖ్యమంత్రికి తీరిక లేదా? అంటూ ప్రశ్నించారు. అదే సమయంలో చంద్రబాబుపై అసందర్భంగా కథనాలు ప్రసారం చేసిందంటూ జగన్ మీడియాపై కూడా మండిపడ్డారు. పార్టీలో తమ కులానికి తీవ్ర అన్యాయం చేస్తున్నారని వైసీపీ పెద్దలపై వెంకటసుబ్బయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. గుండెల్లో పెట్టుకుంటామని చెప్పి.. గుండెలపై తన్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రోశయ్యను సీఎం పదవి నుంచి దించే వరకు ఆ సామాజిక వర్గం నిద్రపోలేదని అన్నారు. మర్రి రాజశేఖర్ సమక్షంలోనే ఆయన బావమరిది ముఖ్యమంత్రిపై వ్యాఖ్యలు చేయడంపై వైసీపీలో కలకలం రేపుతోంది.

Updated Date - 2021-12-10T17:12:57+05:30 IST