-
-
Home » Andhra Pradesh » Guntur » Guntur district-MRGS-AndhraPradesh
-
విజయవాడ: మరో మలుపు తిరిగిన కొరియర్ ద్వారా పంపిన డ్రగ్స్ కేసు
ABN , First Publish Date - 2022-05-02T21:44:07+05:30 IST
విజయవాడ నుంచి కొరియర్ ద్వారా డ్రగ్స్ పంపిన కేసు మరో మలుపు తిరిగింది.
గుంటూరు జిల్లా: విజయవాడ నుంచి కొరియర్ ద్వారా డ్రగ్స్ పంపిన కేసు మరో మలుపు తిరిగింది. గుంటూరు జిల్లా, సత్తెనపల్లి మండలానికి చెందిన యువకుడు గోపి సాయి అడ్రస్తో పార్శిల్ బుక్ అయింది. అయితే ఆ పార్శిల్తో తనకు ఎలాంటి సంబంధంలేదని, తన ఫోటోను మార్ఫింగ్ చేసి బుక్ చేశారని గోపిసాయి చెబుతున్నాడు.
విజయవాడలోని ఓ కొరియర్ నుంచి ఆస్ట్రేలియాకు నాలుగున్నర కేజీల ఎపిడ్రిన్ డ్రగ్స్ పార్శిల్ చేశారు. అడ్రస్ సరిగా లేకపోవడంతో కెనడా వెళ్లి తిరిగి బెంగళూరు చేరింది. కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో ఈ డ్రగ్స్ ప్యాకెట్ బయటపడింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు విజయవాడ ప్రసాదంపాడుకు చెందిన కొరియర్ బాయ్ తేజను అరెస్టు చేశారు. ఆయన కొన్నేళ్లుగా భారతీ నగర్లో ఓ కొరియర్ సంస్థలో పనిచేస్తున్నట్లు గుర్తించారు. అయితే ఆస్ట్రేలియాకు పంపిన పార్శిల్ సత్తెనపల్లి మండలం, లక్కరాజు గార్లపాడుకు చెందిన గోపిసాయి పేరుతో బుక్ చేశారు. దీంతో గోపిసాయిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.