AP News: అధికారుల తీరుపై మాజీ హోం మంత్రి సుచరిత అసహనం

ABN , First Publish Date - 2022-09-26T20:26:33+05:30 IST

కాకుమానులో నీటి పారుదల శాఖ అధికారులతో మాజీ హోం మంత్రి సుచరిత సమీక్ష నిర్వహించారు.

AP News: అధికారుల తీరుపై మాజీ హోం మంత్రి సుచరిత అసహనం

గుంటూరు జిల్లా (Guntur Dist.): కాకుమానులో నీటి పారుదల శాఖ అధికారులతో మాజీ హోం మంత్రి సుచరిత (Sucharita) సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు తీరుపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. సీజన్ ప్రారంభం నాటికి కాల్వలలో పూడిక ఎందుకు తీయలేదని ఆమె నిలదీశారు. ఇప్పటికైనా అధికారులు తమ పంధా మార్చుకోవాలని సుచరిత  హెచ్చరించారు.


కాగా అప్పాపురం చానల్ కింద 30 వేల ఎకరాల పంట భూమి ఉంది. అధికారుల నిర్లక్ష్యంతో చుక్క నీరు కిందకు రావడం లేదని రైతుల ఆవేదన వ్యక్తం చేశారు. సగానికి పైగా పోలాలకు నీరు అందలేదని రైతులు సుచరితకు ఫిర్యాదు చేశారు. కాంట్రాక్టర్లతో అధికారులు కుమ్మక్కై రైతులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. 

Updated Date - 2022-09-26T20:26:33+05:30 IST