Guntur: గ్యాంగ్రేప్ ఘటనలో నిందితుల అరెస్ట్..
ABN , First Publish Date - 2021-09-09T16:32:23+05:30 IST
గుంటూరు జిల్లాలోని గ్యాంగ్రేప్ ఘటన విచారణలో పోలీసులు పురోగతి సాధించారు. మేడికొండూరు మండలం పాలడుగు అడ్డరోడ్డు వద్ద బుధవారం అర్ధరాత్రి బైక్పై వెళ్తున్న...
గుంటూరు: గుంటూరు జిల్లాలోని గ్యాంగ్రేప్ ఘటన విచారణలో పోలీసులు పురోగతి సాధించారు. మేడికొండూరు మండలం పాలడుగు అడ్డరోడ్డు వద్ద బుధవారం అర్ధరాత్రి బైక్పై వెళ్తున్న దంపతులపై దాడి చేసి మహిళపై సామూహిక అత్యాచారం చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన అనంతరం బాధితురాలు అదే రాత్రి సత్తెనపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితులను పోలీసులు పట్టుకున్నారు. పాలడుగు దగ్గర కోల్డ్ స్టోరేజ్లో పనిచేసే 8 మంది కార్మికులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వీరంతా ఒడిశా, విజయనగరానికి చెందిన యువకులుగా గుర్తించారు. నిందితులపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.