వివాదాస్పదంగా మారిన వినుకొండ ఎమ్మెల్యే రోడ్డు నిర్మాణం శంకుస్థాపన

ABN , First Publish Date - 2021-07-02T19:33:32+05:30 IST

వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు వ్యవహారశైలి మరోసారి విమర్శలకు దారితీస్తోంది.

వివాదాస్పదంగా మారిన వినుకొండ ఎమ్మెల్యే రోడ్డు నిర్మాణం శంకుస్థాపన

గుంటూరు జిల్లా: వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు వ్యవహారశైలి మరోసారి విమర్శలకు దారితీస్తోంది. వినుకొండ టౌన్‌కు బైపాస్ రోడ్డు పేరుతో మార్కాపురం రోడ్డులో నూతన రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అయితే సొంత లబ్దికోసమే ఈ రోడ్డు నిర్మాణం చేపట్టారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వినుకొండకు బైపాస్ పేరుతో ప్రైవేట్ వ్యక్తుల పొలాల నుంచి రోడ్డును నిర్మించబోతున్నారు. అయితే ఈ రోడ్డులో పొలాలు కోల్పోతున్న కొందరు రైతులు దీన్ని వ్యతిరేకిస్తున్నారు.


రోడ్డు నిర్మాణం కోసం వచ్చిన యంత్రాలను అక్కడ పొలం ఉన్న శ్రీనివాసరావు దంపతులు అడ్డుకున్నారు. తమ అనుమతి లేకుండా తమ పొలంలో ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు రోడ్డు వేసే ప్రయత్నం చేయడం చట్టవిరుద్ధమన్నారు. తమ పొలంలో రోడ్డు వేసే ప్రయత్నంపై బాధిత రైతులు వినుకొండ తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అయినా అధికారుల నుంచి స్పందన లేదని రైతు కుంటుంబం ఆరోపిస్తోంది. మరోవైపు ఆ రోడ్డు నిర్మాణానికి అధికారుల సమక్షంలోనే ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు భూమి పూజ చేయడం వివాదాస్పదమవుతోంది.

Updated Date - 2021-07-02T19:33:32+05:30 IST