గుంటూరు జిల్లా: ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2021-06-18T16:15:16+05:30 IST

గుంటూరు జిల్లాలో మళ్లీ ఆ ఎమ్మెల్యే, ఎంపీల మధ్య వార్ మొదలైంది.

గుంటూరు జిల్లా: ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే

గుంటూరు: జిల్లాలో  మళ్లీ ఆ ఎమ్మెల్యే, ఎంపీల మధ్య వార్ మొదలైంది. ఆ నేతల మధ్య ఆదిపత్య పోరుతో  ఉద్యోగులకు తిప్పలొచ్చిపడ్డాయి. ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రోటోకాల్ పాటించడంలేదంటూ ఏకంగా ఎంపీ కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడం జిల్లాలో సంచలనంగా మారింది. గుంటూరు జిల్లా నర్సరావుపేట ఎంపీ శ్రీకృష్ణ దేవరాయులు, చిలకలూరిపేట ఎమ్మెల్యే రజనీల మధ్య విబేధాలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. గతంలో ఎంపీ, ఎమ్మెల్యే మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. ఎంపీ ఎప్పుడు నియోజకవర్గంలోకి వచ్చినా ఎమ్మెల్యే వర్గీయులు అడ్డుకోవడం, రచ్చ రచ్చ చేయడం రొటీన్‌గా మారింది. 


ఎన్నికల్లో గెలిచిన తర్వాత మొదట్లో ఇద్దరి మధ్య విబేధాలు లేవు. అయితే ఎంపీ శ్రీకృష్ణ దేవరాయులు, చిలకలూరిపేటకు చెందిన మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌కు మద్దతు ఇస్తున్నారని ఎమ్మెల్యే వర్గీయులు భావించారు. దీంతో ఎంపీ, ఎమ్మెల్యే మధ్య విబేధాలు మొదలయ్యాయి.



Updated Date - 2021-06-18T16:15:16+05:30 IST