నేటి నుంచి గురజాల డివిజన్‌లో లాక్‌డౌన్

ABN , First Publish Date - 2020-07-16T13:03:16+05:30 IST

గురువారం నుంచి గురజాల రెవిన్యూ డివిజన్ లాక్‌డౌన్ విధిస్తున్నట్లు గురజాల ఆర్‌డీవో పార్థసారథి ప్రకటించారు.

నేటి నుంచి గురజాల డివిజన్‌లో లాక్‌డౌన్

గుంటూరు: గురువారం నుంచి గురజాల రెవిన్యూ డివిజన్ లాక్‌డౌన్ విధిస్తున్నట్లు గురజాల ఆర్‌డీవో పార్థసారథి ప్రకటించారు. ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు అనుమతి నిత్యవసరాలు కొనుగోలు చేయాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దన్నారు. ప్రతి ఒక్కరు మాస్కు ధరించి భౌతిక దూరం పాటించాలని పార్థసారథి చెప్పారు. ఈ రోజు గుంటూరు జిల్లాలో రికార్డు స్థాయిలో 568 కరోనా కేసులు నమోదయ్యాయి. జిల్లాలో 5వేలకు పాజిటివ్ కేసుల సంఖ్య దాటింది. గుంటూరు కార్పోరేషన్ పరిధిలోనే 235 కేసులు నమోదయ్యాయి. తాడేపల్లి 70, నర్సరావుపేట 36, పిడుగురాళ్ల 29, తెనాలి 28, మంగళగిరి 26, దాచేపల్లి 20, ప్రత్తిపాడు 20, సత్తెనపల్లి 17, వినుకొండ 15, పెదకాకాని 10 కేసులు నమోదయ్యాయి.

Updated Date - 2020-07-16T13:03:16+05:30 IST