బీజేపీకి మేయర్ పీఠం ఇస్తే....: కన్నా లక్ష్మీనారాయణ

ABN , First Publish Date - 2021-02-25T17:30:29+05:30 IST

నగరంలో అభివృద్ధి అంతా తాను మంత్రిగా చేసిందేనని బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. గురువారం 35వ డివిజన్ బీజేపీ అభ్యర్థి ఏల్చూరి వెంకటేశ్వర్లు ఎన్నికల కార్యాలయాన్ని కన్నా ప్రారంభించారు.

బీజేపీకి మేయర్ పీఠం ఇస్తే....: కన్నా లక్ష్మీనారాయణ

గుంటూరు:  నగరంలో అభివృద్ధి అంతా తాను మంత్రిగా చేసిందేనని బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. గురువారం 35వ డివిజన్ బీజేపీ అభ్యర్థి ఏల్చూరి వెంకటేశ్వర్లు ఎన్నికల కార్యాలయాన్ని కన్నా ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ 2014 నుంచి టీడీపీ, వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి శూన్యమని విమర్శించారు. బీజేపీ - జనసేన కూటమికి అధికారం ఇస్తే ఎమ్మెల్యేలకు లంచాలు వచ్చే సంస్కృతి లేకుండా చేస్తామన్నారు. కేంద్రం నుంచి నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజలు కట్టిన పన్నులు వసూలు చేసుకుని ప్రజా సంక్షేమం వదిలేశారని ఆయన మండిపడ్డారు. బీజేపీకి మేయర్ పీఠం ఇస్తే పెంచిన ఇంటి పన్నులు నిలిపివేస్తామని భరోసా ఇచ్చారు. ఇంటి ప్లాన్ , కరెంట్ కనెక్షన్, వాటర్ కనెక్షన్‌లకు ఏదైనా ఎమ్మెల్యేలకు టాక్స్ కట్టాల్సి వస్తుందన్నారు. బీజేపీ అభ్యర్థులు గెలిచిన డివిజన్‌లలో ఎమ్మెల్యేలు ట్యాక్స్ లేకుండా చేస్తామన్నారు. ప్రాంతీయ పార్టీలు చాక్లెట్ ఇచ్చి నెక్లెస్‌లు లాక్కెళ్లే పరిస్థితి ఏర్పడిందని కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు.

Updated Date - 2021-02-25T17:30:29+05:30 IST