Gunturలో ఆటో బోల్తా... వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2022-03-21T16:24:34+05:30 IST

జిల్లాలోని రొంపిచెర్ల మండలం విప్పర్ల వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. కూలీల ఆటో అదుపుతప్పి బోల్తా పడింది.

Gunturలో ఆటో బోల్తా... వ్యక్తి మృతి

గుంటూరు: జిల్లాలోని రొంపిచెర్ల మండలం విప్పర్ల వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. కూలీల ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఏసు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా... మరో 12 మందికి గాయాలయ్యాయి. వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను వెంటనే గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. మిర్చి కోతలకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2022-03-21T16:24:34+05:30 IST