తెనాలిలో ఆలపాటి రాజా నిరసన
ABN , First Publish Date - 2022-03-19T18:35:56+05:30 IST
తెనాలిలో మాజీ మంత్రి ఆలపాటి రాజా ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. టీడీపీ ఆఫీస్ నుంచి సెబ్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు.
గుంటూరు: తెనాలిలో మాజీ మంత్రి ఆలపాటి రాజా ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. టీడీపీ ఆఫీస్ నుంచి సెబ్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కల్తీ సారా మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని... బాధిత కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆలపాటి రాజా మాట్లాడుతూ... నాటు సారాను అరికట్టలేని ప్రభుత్వం సిగ్గు పడాలన్నారు. మద్యాన్ని ఆదాయంగా చూపుతూ పాలన చేసే సీఎం జగన్ మాత్రమే అని ఆలపాటి రాజా దుయ్యబట్టారు.