Gunturలో దారి దోపిడీ ముఠా అరెస్ట్

ABN , First Publish Date - 2021-12-24T14:52:56+05:30 IST

జిల్లాలోని చిలకలూరుపేట నియోజవర్గంలో దారి దోపిడీలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.

Gunturలో దారి దోపిడీ ముఠా అరెస్ట్

గుంటూరు: జిల్లాలోని చిలకలూరుపేట నియోజవర్గంలో దారి దోపిడీలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా సామూహిక అత్యాచారాలకు పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నలుగురు సభ్యుల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాలుగు జంటలపై దాడి చేసిన ముఠా... బంగారు ఆభరణాలు, డబ్బులు చోరీ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ముఠా సభ్యులను పోలీసులు ఈరోజు మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. 

Updated Date - 2021-12-24T14:52:56+05:30 IST