AP: రేపల్లెలో భారీగా ఇసుక డంప్ స్వాధీనం
ABN , First Publish Date - 2021-10-13T15:49:41+05:30 IST
రేపల్లె నియోజకవర్గంలో భారీగా ఇసుక డంప్ను మైనింగ్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు.
గుంటూరు: రేపల్లె నియోజకవర్గంలో భారీగా ఇసుక డంప్ను మైనింగ్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. రేపల్లె మండలం పెదపల్లి లో అక్రమ నిల్వలను సిబ్బంది గుర్తించింది. వైసీపీ నేతల ఆధ్వర్యంలో ఇసుక అక్రమ డంపింగ్ నడుస్తోంది. స్థానిక రెవిన్యూ సిబ్బందితో కలసి మైనింగ్ అధికారులు డంప్ లెక్కలను తేలుస్తున్నారు.