AP: హోంమంత్రి నియోజకవర్గంలో ఇళ్ల పేరుతో మోసం
ABN , First Publish Date - 2021-10-10T15:19:25+05:30 IST
హోంమంత్రి నియోజకవర్గంలో ఇళ్ల పేరుతో ఓ సంస్థ మోసానికి పాల్పడింది.
గుంటూరు: హోంమంత్రి నియోజకవర్గంలో ఇళ్ల పేరుతో ఓ సంస్థ మోసానికి పాల్పడింది. సిటిజన్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ పేరుతో ఇల్లు కట్టిస్తామని పేదల నుంచి పెద్ద మొత్తంలో నగదును సంస్థ వసూలు చేసింది. అయితే నెలల గడుస్తున్నప్పటికీ ఇళ్ల నిర్మాణంలో పురోగతి లేదు. దీంతో తాము మోసపోయినట్లు గుర్తించిన బాధితులు వట్టిచెరుకూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జెడ్పీటీసీ భీమీనేని వెంకట లక్ష్మి చేబితేనే డబ్బులు కట్టామని బాధితులు వాపోతున్నారు.