Guntur: ఆయిల్ కంపెనీలో పేలిన సిలిండర్
ABN , First Publish Date - 2022-04-22T15:09:03+05:30 IST
జిల్లాలోని పొన్నూరు మండలం బ్రాహ్మణ కోడూరులోని ఓ ఆయిల్ కంపెనీలో ప్రమాదం జరిగింది.
గుంటూరు: జిల్లాలోని పొన్నూరు మండలం బ్రాహ్మణ కోడూరులోని ఓ ఆయిల్ కంపెనీలో ప్రమాదం జరిగింది. కంపెనీలో ఒక్కసారి సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా... మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే అతడిని చికిత్స నిమిత్తం జీజీహెచ్కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.