Guntur: నవతరం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఇంటిపై దాడి
ABN , First Publish Date - 2022-04-16T13:32:17+05:30 IST
నవతరం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రావు సుబ్రమణ్యం ఇంటిపై గుర్తు తెలియని దుండగులు దాడికి పాల్పడ్డారు.
గుంటూరు: నవతరం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రావు సుబ్రమణ్యం ఇంటిపై గుర్తు తెలియని దుండగులు దాడికి పాల్పడ్డారు. చిలకలూరిపేటలోని ఇంటిపై దుండగులు దాడి చేశారు. దుండగుల దాడిలో కారు ధ్వంసం అయ్యింది. అలాగే ఇంటి ముందు సీసీ కెమెరాలను ధ్వంసం దుండగులు ధ్వంసం చేశారు. దాడి సమయంలో రావు సుబ్రమణ్యం ఇంటిలో లేరని కుటుంబసభ్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.