Guntur: ఆస్తి కోసం అక్కపై తమ్ముడి కుటుంబం దాడి

ABN , First Publish Date - 2022-04-15T19:20:26+05:30 IST

జిల్లాలోని క్రోసూరు మండలం ఊటుకూరులో దారుణం చోటు చేసుకుంది. ఆస్తి కోసం సొంత అక్కపై తమ్ముడు కుటుంబం దాడి చేసింది.

Guntur: ఆస్తి కోసం అక్కపై తమ్ముడి కుటుంబం దాడి

గుంటూరు: జిల్లాలోని క్రోసూరు మండలం ఊటుకూరులో దారుణం చోటు చేసుకుంది. ఆస్తి కోసం సొంత అక్కపై తమ్ముడు కుటుంబం దాడి చేసింది. నడి రోడ్డు మీద బట్టలు చింపి విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. అటు దివ్యాంగురాలైన చిన్నారిపై కుడా తమ ప్రతాపం చూపించారు. దాడిపై బాధితురాలు వీరమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమకు జరిగిన అవమానంతో బాధితులు తీవ్ర మనస్తాపానికి గురైంది. న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటామని వీరమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం వీరమ్మ ఆవేదన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

Updated Date - 2022-04-15T19:20:26+05:30 IST