Guntur: పెన్షన్ దారులకు చినిగిన నోట్ల పంపిణీ
ABN , First Publish Date - 2022-04-09T17:35:37+05:30 IST
జిల్లాలోని బాపట్ల కుక్కలవారిపాలెంలో పెన్షన్ దారులకు వాలంటీర్లు చినిగిన నోట్లను పంపిణీ చేశారు.
గుంటూరు: జిల్లాలోని బాపట్ల కుక్కలవారిపాలెంలో పెన్షన్ దారులకు వాలంటీర్లు చినిగిన నోట్లను పంపిణీ చేశారు. దీనిపై వాలంటీర్ను ప్రశ్నించగా..తమకు ఇవే ఇచ్చారంటూ లబ్ధిదారులకు సమాధానం ఇస్తున్నారు. బ్యాంక్కు వెళ్లి మార్చుకోవాలంటూ సలహా ఇస్తున్నారు. ఈ వాలంటీర్ పరిధిలోనే దాదాపు పది మందికి ఇదే పరిస్థితి నెలకొంది. వాలంటీర్ తీరుపై లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.