అక్రమంగా పీడీఎస్ రైస్ తరలింపు...పట్టుకున్న పోలీసులు

ABN , First Publish Date - 2021-02-25T19:17:23+05:30 IST

పాల వాహనాలలో అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ రైస్‌ను అరండల్ పేట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అక్రమంగా పీడీఎస్ రైస్ తరలింపు...పట్టుకున్న పోలీసులు

గుంటూరు: పాల వాహనాలలో అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ రైస్‌ను  అరండల్ పేట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  శారదాకాలనీకి చెందిన మరియమ్మ  అనే మహిళ అధిక ధరకు పీడీఎస్ రైస్‌ను విక్రయించేందుకు నిల్వ చేస్తోంది. మరియమ్మకు మరో ఐదుగురు వ్యక్తులు సహకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పీడీఎస్ రైస్‌ను అక్రమంగా తరలిస్తుండగా  వాహనాలతో సహా రైస్ సీజ్ చేసి ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. పీడీఎస్ రైస్ విలువ రూ.35లక్షలుగా తెలుస్తోంది. వాహనాలు సీజ్ చేసినట్టు డిఎస్పీ సుప్రజ తెలిపారు. 

Updated Date - 2021-02-25T19:17:23+05:30 IST