తెనాలి మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

ABN , First Publish Date - 2020-10-29T18:02:35+05:30 IST

టీడీపీ ప్రభుత్వంలో నిర్మించిన టిట్కో ఇళ్ళను లబ్దిదారులకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి ఆళపాటి రాజా చేపట్టిన మహాపాదయాత్ర ఉద్రిక్తంగా మారింది.

తెనాలి మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

గుంటూరు: టీడీపీ ప్రభుత్వంలో నిర్మించిన టిట్కో ఇళ్ళను లబ్దిదారులకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ  మాజీ మంత్రి ఆళపాటి రాజా చేపట్టిన మహాపాదయాత్ర ఉద్రిక్తంగా మారింది. తెనాలి మున్సిపల్ కార్యాలయం వద్ద టిట్కో లబ్దిదారులతో వచ్చిన రాజాను అధికారులు అడ్డుకున్నారు. కార్యాలయం లోపలికి వెళ్లేందుకు అనుమతి నిరాకరిస్తూ గేట్లు మూసివేశారు. దీంతో మున్సిపల్ అధికారుల తీరుపట్ల ఆలపాటి ఆగ్రహం వ్యక్తం చేశారు. గేటు ఎదుట రోడ్డుపై బైఠాయించిన టిడ్కో లబ్దిదారులు... మున్సిపల్ అధికారులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 


Updated Date - 2020-10-29T18:02:35+05:30 IST